Sunday, February 8, 2026
E-PAPER
Homeఖమ్మంఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలి

ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలి

- Advertisement -

– ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ విడుదల చేయాలి
– పీఆర్సీని అమలు చేయాలి 
– టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి
నవతెలంగాణ – బోనకల్
: అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులు, ఉద్యోగులకు హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని, పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని అన్ని సంఘాలతో చర్చించి సమంజసమైన ఫిట్మెంట్ 2023 జులై 1 నుంచి అమలు చేయాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల పరిధిలోనే పెద్ద బీరువల్లి గ్రామానికి చెందిన ఆళ్ళ హనుమంతరావు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హనుమంతరావు కుటుంబ సభ్యులను ఆదివారం పెద్ద బీరవల్లిలో చావా రవి పరామర్శించారు. అనంతరం పెద్ద బీరువల్లి గ్రామంలో జరిగిన టీఎస్ యుటిఎఫ్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. 2024 మార్చి నుంచి రిటైరైన ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని, డిఎ వాయిదాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నూతన రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 కి అనుగుణంగా  ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలను రూపొందించి డిఈఒ, డిప్యూటీ ఇఒ, ఎంఈఒ తదితర పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయడం ద్వారా విద్యా శాఖలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించాలని కోరారు. టెట్ మినహాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అర్హత మార్కులను తగ్గించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేయవలసిన గత్యంతర పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని విమర్శించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం చేయకుండా విద్యారంగం ఎలా అభివృద్ధి చెందుతుందో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కానీ ఆ సమస్యలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు అనేక రకాల హామీలు ఇచ్చారని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అమలు చేయడం లేదో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ లోకానికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, నాయకులు హనుమంతరావు, కృష్ణారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -