- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: విదేశీ పర్యటనలో భాగంగా వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భారత్కు చేరుకున్నారు. నాలుగు రోజుల పాటు ఇండియాలో పర్యటించనున్నారు. తాజాగా గురువారం ప్రధాని మోడీతో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ను కలిశారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సమావేశమయ్యారు. ఇంధన భద్రత, వాణిజ్యం. పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధనం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చలు సాగించనున్నారు. ఈ పర్యటనతో భారత్-వెనిజులా సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నాయి.
- Advertisement -



