Monday, February 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమార్చి రెండో వారంలో..

మార్చి రెండో వారంలో..

- Advertisement -

ఆర్‌ కె ఫిలిమ్స్‌, సిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్‌లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్‌ దర్శక, నిర్మాతగా బిఎస్‌ రెడ్డి సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘ఆర్‌కే దీక్ష’. ఢీ, జోడి ఫేమ్‌ అక్సఖాన్‌, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్‌గా, కిరణ్‌ హీరోగా నటిస్తున్నారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్‌ శర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి రెండో వారంలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ,’మార్చి రెండో వారంలో రిలీజ్‌ చేయాలని నిర్ణయించాం. అప్పటికి విద్యార్థుల పరీక్షలు కూడా పూర్తవుతాయి. వాస్తవానికి మేము ఈ సంక్రాంతి పండక్కే సినిమా విడుదల చేయాలని అనుకున్నాం.

కానీ ఇంకా క్వాలిటీగా సీజీ వర్క్‌ చేయించడంతో ఆలస్యమైంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. పట్టుదలగా ప్రయత్నిస్తే విజయం సాధ్యమనే మంచి సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుంది. లవ్‌, యాక్షన్‌, ఎమోషన్‌ వంటి అన్ని అంశాలుంటాయి. మా మూవీ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మధు ప్రియ మూడు పాటలు పాడింది. అక్సఖాన్‌ చేసిన సాంగ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌ అవుతుంది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్‌ మురళీ నాయక్‌తో పాటు ఇతర వీర జవాన్ల కీర్తిని ప్రశంసిస్తూ ఒక మంచి పాటని రూపొందించాం. బీఎస్‌ రెడ్డి చిత్ర సమర్పకులుగా మాకు సహకారం అందించారు. రోహిత్‌ శర్మ అనే విలన్‌ను పరిచయం చేస్తున్నాం. 118 దేశాల్లో నాన్‌ చాక్‌లో మెడల్స్‌ గెల్చుకున్న రవి మాస్టర్‌ మా మూవీకి స్టంట్స్‌ కంపోజ్‌ చేశారు. హీరో కిరణ్‌ కు ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -