- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్ పర్యటన రద్దయింది. పంత్నగర్ చేరుకున్న ఆయన.. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల పైలట్ నిరాకరించడంతో హెలికాప్టర్లో అల్మోరా, పౌరీ గర్వాల్లలో జరగాల్సిన బహిరంగ సభలకు వెళ్లలేకపోయారు. రాష్ట్ర సమస్యలపై ప్రజలు, మాజీ సైనికులతో చర్చించాల్సి ఉందని.. భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ తెలిపారు. అతి త్వరలోనే మళ్లీ ఉత్తరాఖండ్కు వస్తానని తెలిపారు.
- Advertisement -



