నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కౌంటింగ్ హాళ్లలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా నిషేధించబడినట్లు స్పష్టం చేశారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు, ఎవరూ ఈ నిబంధనలను ఉల్లంఘించరాదని ఆదేశించారు.భద్రతా తనిఖీలు నిర్వహించిన తర్వాత మాత్రమే లోనికి అనుమతిస్తామని చెప్పారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్నికల చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని కోరారు.
ఎలక్ట్రానిక్ వస్తువులు కౌంటింగ్ హాలులోకి అనుమతించబడవు: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



