నవతెలంగాణ – భీంగల్
గెలుపుకు పొంగిపోము… ఓటమికి కుంగిపోము .. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. భీంగల్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ విజయం సాదించడం కోసం కష్టపడ్డ ప్రతి నాయకుడు, కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.
ఓడినా సరే ప్రజల పక్షాన నిలబడి, ప్రజలకు ఇచ్చిన హామీల సాధన కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాము. భీంగల్ పట్టణ అభివృద్ధి కోసం ఎప్పటికీ ప్రజలతో కలిసి పనిచేస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలలో అదే విశ్వాసం నిలబెట్టుకొని పారదర్శకంగా సేవ చేస్తారని ఎమ్మెల్యే వేముల ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.



