- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లి గ్రామ శివారులో జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం రంగారావుపేట వెళ్లే దారిలో ఉన్న కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం శివ డోలోత్సవం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అర్చకులు గంగా ప్రసాద్ దీక్షిత్ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలను, అభిషేక లను నిర్వహించారు. అనంతరం మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్య తరలివచ్చిన భక్తుల శివనామ స్మరణతో స్వామి వారిని ఊయాలలో ఊగించి డోలోత్సవం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు.
- Advertisement -



