- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాజస్థాన్లోని అల్వర్ జిల్లా ఖుష్ఖేడా పరిశ్రమల ప్రాంతంలో సోమవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ప్లాట్ నంబర్ G-1, 118లో ఉన్న ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఫ్యాక్టరీలో లోపల పనిచేస్తున్న ఏడుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
- Advertisement -



