- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధినేత తారిఖ్ రహ్మాన్ ఆ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధ్యక్షుడు మొహమ్మెద్ షాహబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు.
ఎన్నికల్లో 297 స్థానాలకుగాను బీఎన్పీ 209 చోట్ల గెలిచింది. అతివాద జమాతే ఇస్లామీ కేవలం 68 సీట్లకు పరిమితమైంది. ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ ప్రమాణస్వీకారోత్సవానికి భారత్ తరఫున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
- Advertisement -



