- Advertisement -
నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని జన్నెపల్లి గ్రామ శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీ పోటీలు సోమవారం జోరుగా సాగాయి. ఈ కుస్తీ పోటీలలో 140 మంది మల్ల యోధులు పాల్గొని 70 కుస్తీ పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన వారికి నగదు బహుమతితో పాటు మెమొంటోలను ప్రధానం చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగాధర్, ఉపసర్పంచ్ వీరేందర్ రావు, మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



