- Advertisement -
భారత్, నెదర్లాండ్ ఢీ నేడు
లీడ్స్ (ఇంగ్లాండ్) : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో టీమ్ ఇండియా గెలుపు జోరు కొనసాగించాలని చూస్తోంది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై అదిరే విజయం సాధించిన హర్మన్ప్రీత్ సేన నేడు నెదర్లాండ్స్తో తలపడనుంది. నెదర్లాండ్స్ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. భీకర ఫామ్లో ఉన్న భారత్ను ఎదుర్కొవటం నెదర్లాండ్స్కు శక్తికి మించిన పనే కానుంది. స్మృతీ మంధాన, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మలు భారత్కు కీలకం కానున్నారు. నెదర్లాండ్స్ హీథర్, సన్యా, ఐరిస్, సిల్వర్లపై ఎక్కువగా ఆధారపడుతోంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది.
- Advertisement -



