Wednesday, February 18, 2026
E-PAPER
Homeక్రైమ్కారు అద్దాలు పగులగొట్టి రూ.8 లక్షల చోరీ..

కారు అద్దాలు పగులగొట్టి రూ.8 లక్షల చోరీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బంధువుల చికిత్స, వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఓ వ్యక్తి బ్యాంకు నుంచి డ్రా చేసిన రూ.8 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు కారు అద్దాలు పగులగొట్టి అపహరించారు. ఈ ఘటన బాన్సువాడలో మంగళవారం చోటుచేసుకుంది. బాన్సువాడ సీఐ శ్రీధర్‌ కథనం ప్రకారం.. బిచ్కుంద మండలం హస్గుల్‌కు చెందిన యాదారావు అనే వ్యక్తి బాన్సువాడ ఎస్‌బీఐ బ్యాంకులో బంధువుల చికిత్స, వ్యక్తిగత అవసరాల నిమిత్తం రూ.8 లక్షలు డ్రా చేసి కారులో బయల్దేరారు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంకు నుంచి ద్విచక్ర వాహనంపై కారును వెంబడించారు. స్థానిక తాడ్కోల్‌ రోడ్డులోని పార్కింగ్‌ స్థలంలో కారు నిలిపి ఓ దుకాణంలో బిస్కెట్స్‌ కొనుగోలు చేసేందుకు యాదారావు వెళ్లారు. తిరిగి వచ్చే సరికి కారు అద్దాలు పగులగొట్టి ఉన్నాయి. వాహనంలోని బ్యాగులో ఉన్న రూ.8 లక్షల నగదు కనిపించలేదు. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించారు. బ్యాంకు, దుకాణం వద్ద ఉన్న సీసీ కెమెరాలను వారు పరిశీలించి నలుగురు వ్యక్తులు కలిసి నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -