- Advertisement -
– ముస్త్యాల గ్రామ సర్పంచ్ సుంకరి మహేందర్
నవతెలంగాణ-రామగిరి : గ్రామ ప్రజల సమస్యలను సమయానుసారం పరిష్కరించడం నా ప్రధాన కర్తవ్యమనీ రామగిరి మండలంలోని ముస్త్యాల గ్రామ సర్పంచ్ సుంకరి మహేందర్ అన్నారు. ముస్త్యాల గ్రామంలో రైతుల పంట పొలాలకు నీళ్లు రాక ఎదుర్కొంటున్న సమస్యను ఆర్ జీ-1 జిఎం లలిత్ కుమార్ ను కలిసి సమస్య చెప్పడంతో జిఎం వెంటనే స్పందించి పెద్ద మోటర్ ద్వారా నల్ల చెరువులోకి నీళ్లను మళ్ళించారనీ అన్నారు. మున్సిపల్ గ్రామా రైతులు వారి సమస్య చెప్పడంతో వెంటనే స్పందించిన జిఎంకు అలాగే ముస్త్యాల గ్రామ సర్పంచ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాసినేని వినోద సత్యనారాయణ రావు గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



