నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సమీపంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని విగ్రహ దాత మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి ఆవిష్కరించి పుస్పంజలి గంటించారు. గ్రామస్థులు పెద్దలు యువకులు పాల్గొని మండల కేంద్రంలోని గాంధీ చౌక్ నుండి శివాజీ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. శివాజీ మహరాజ్ ధైర్యం, స్వాభిమానమ్ యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.యువకులు దేశ సమాజంలో ఐక్యత భావం పెంపొందించుకోవాలని అన్నారు.శివాజి మహరాజ్ విగ్రహ దాత మాజీ ఎంపీపీ చేయడం మన మండలానికి ఆదర్శంగా ఉందని మాజీ ఎమ్మెల్యే సౌదగర్ గంగారాం సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పలువురికి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు,గ్రామస్తులు, పెద్దలు,యువకులు పాల్గోన్నారు.
ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ చేసిన మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



