జేఏసీ కన్వీనర్ మామిడి మాడ భాస్కర్
నవతెలంగాణ – మిడ్జిల్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా నిరుద్యోగులు గ్రామస్థాయి నుండి జేఏసీ కమిటీలు వేసుకొని ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినంక ఉద్యమకారులను విస్మరించిందని మిడ్జిల్ ఉమ్మడి మండల్ జేఏసీ కన్వీనర్, విద్యార్థి సంఘం నాయకుడు మామిడి మాడ భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ కారులకు ఐడి కార్డులు ఇచ్చి వారికి గుర్తింపు ఇస్తాం అని చెప్పి మోసం చేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో నాయకులు, ఉద్యమ కారులు పదవులు లేక ,ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక, ఎంతోమంది అద్వన స్థితిలో ఉన్నారు అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం రోడ్డుకి ఉద్యమాలు, పోరాటాలు చేస్తే , తెలంగాణ వ్యతిరేకులను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని పదవులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులను గుర్తించి, ఇండ్లు ప్లాట్లు తోపాటు నామినేటెడ్ పదవులు తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాలని ప్రజా ప్రభుత్వాన్ని కోరారు.



