ముగ్గురికి గాయాలు
నవతెలంగాణ-హయత్నగర్
హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని చట్నీస్ హోటల్లో శుక్రవారంర ఇడ్లీ స్టీమర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్కు చెందిన జోగేశ్వర్ (20), దయా (23), సుమత్ (21), సునీల్ (21) రోజూ మాదిరిగానే మధ్యాహ్నం సమయంలో హోటల్ కిచెన్లో టిఫిన్ తయారు చేస్తుండగా ఒక్కసారిగా ఇడ్లీ స్టీమర్ పేలింది. దీంతో భారీ శబ్ధం రావడంతో వినియోగదారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో గదిలో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.



