- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హర్మూజ్ జలసంధి నిర్వహణ బాధ్యతలను ఇరాన్ స్వయంగా చూసుకుంటుందని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ ఇస్మాయిల్ బాఘేరి తేల్చిచెప్పారు. ఇరాన్ ప్రెస్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జలసంధి యుద్ధానికి ముందున్న స్థితి ఎప్పటికీ రాదని, తమ నిర్వహణలో అంతర్జాతీయ నిబంధనలు పాటిస్తామని ఆయన పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లో జరిగే చర్చల ఫలితాన్ని బట్టి ఇరాన్ తన నిర్ణయం తీసుకుంటుందని బాఘేరి తెలిపారు.
- Advertisement -



