Sunday, February 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థుల సృజనాత్మకత కోసమే టాలెంట్ టెస్ట్

విద్యార్థుల సృజనాత్మకత కోసమే టాలెంట్ టెస్ట్

- Advertisement -

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు
నవతెలంగాణ – ఆలేరు రూరల్

విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి, వారికి ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు తెలిపారు. ఆదివారం ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.ఈ సందర్భంగా లావుడియా రాజు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలను ధైర్యంగా రాయాలని సూచించారు.విద్య అనేది కేవలం మార్కుల కోసం మాత్రమే కాకుండా, విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి ఒక వేదికగా ఉండాలని అన్నారు.

టాలెంట్ టెస్ట్ ద్వారా విద్యార్థుల ఆలోచనా శక్తి, విశ్లేషణ సామర్థ్యం మరియు సృజనాత్మకతను ప్రోత్సహించడం లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూ.టి.ఎఫ్ మాజీ జిల్లా నాయకులు బొమ్మలాంటి బాలరాజు,ఎస్.ఎఫ్.ఐ మాజీ డివిజన్ సెక్రటరీ దాసి శంకర్, వి.ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాళం అయ్యప్ప హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రస్తుత టెక్నాలజీ ఆధారిత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధతో చదువుతూ ముందుకు సాగాలని సూచించారు.రాబోయే వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులై తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు.

ఇలాంటి ప్రేరణాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎస్.ఎఫ్.ఐ సంఘాన్ని అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ మండల కార్యదర్శి, ఉపాధ్యక్షులు కాసుల నరేష్, మద్దెల సాయి గణేష్, సభ్యులు కంతి రాజ్ కుమార్, కందుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -