- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమల లడ్డూ వివాదం మళ్లీ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీని సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్పై మరో కమిటీని ఏర్పాటు చేయడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సిట్, సీబీఐ, టీటీడీలను ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్పై నేడు (సోమవారం) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
- Advertisement -



