- Advertisement -
వేంసూరు: ఖమ్మం జిల్లా వేంసూరు సమీపంలోని గ్రీన్ఫీల్డ్ రోడ్డుపై గురువారం కారు ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణిస్తున్న సమయంలో కారు టైరు అకస్మాత్తుగా పేలడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుకు పక్కన ఉన్న రైలింగ్ను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే కారులో మంటలు చెలరేగి, కొద్దిసేపట్లోనే వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు స్వల్ప గాయలతో బయటపడ్డారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



