- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జపాన్లోని ఈశాన్య తీర ప్రాంతంలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైనట్లు భూకంప పరిశీలన సంస్థలు వెల్లడించాయి. భూ ప్రకంపనలతో పలుచోట్ల ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లు, రోడ్డుపై ఉన్న కార్లు ఊగుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే ప్రస్తుతానికి ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
- Advertisement -



