- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సిస్టమ్ మైగ్రేషన్ కారణంగా జూన్ 26 నుండి 30 వరకు నిలిచిపోయిన ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలు జులై 1వ తేదీ నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. డేటాబేస్ ఏకీకరణ, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కోసం ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. అప్గ్రేడ్ చేయబడిన ప్లాట్ఫారమ్ వేగవంతమైన, మరింత విశ్వసనీయమైన, సురక్షితమైన సేవలను అందిస్తుంది. రూ.5 లక్షలలోపు క్లెయిమ్లు ఆటోమేటిక్గా ప్రాసెస్ చేయబడి, మూడు రోజుల్లోనే పీఎఫ్ నగదు పొందవచ్చు. ఈపీఎఫ్ఓ అధికారులు జులై 1 అర్ధరాత్రి నాటికి సేవలు పూర్తిగా పునరుద్ధరించబడతాయని అధికారులు తెలిపారు.
- Advertisement -



