- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్ను సందర్శించనున్నారు. ఇవాళ ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి, వరంగల్, పరకాల, భూపాలపల్లి, కాటారం మీదుగా ప్రయాణించి, మధ్యాహ్నం 1 గంటకు కన్నెపల్లి పంపుహౌస్కు చేరుకుంటారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులోని పంపుహౌస్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడతారు.
- Advertisement -



