Thursday, July 9, 2026
E-PAPER
Homeఆటలుఫైనల్‌కు చేరేదెవరో?

ఫైనల్‌కు చేరేదెవరో?

- Advertisement -

టీజీ20 క్వాలిఫయర్‌1, ఎలిమినేటర్‌ నేడు
నవతెలంగాణ-హైదరాబాద్‌ : మూడు వారాల పాటు ఉత్సాహంగా సాగిన టీజీ20 లీగ్ దశ మంగళవారంతో ముగియగా.. నేటి నుంచి ప్లే ఆఫ్స్‌ జరుగనున్నాయి. లీగ్‌ దశలో అజేయంగా నిలిచి, ఏడు విజయాలు సాధించిన హైదరాబాద్‌ ఈ చాంపియన్స్‌ క్వాలిఫయర్‌-1లో ఖమ్మం ఏసెస్‌తో పోటీపడనుంది. ఎలిమినేటర్‌లో కరీంనగర్‌ డైమండ్స్‌, రంగారెడ్డి రైజర్స్‌ తలపడనున్నాయి. ప్లే ఆఫ్స్‌కు అవకాశాలు లేని తరుణంలో అతిపెద్ద విజయం నమోదు చేసి అనూహ్యంగా టాప్‌-4లో నిలిచిన రంగారెడ్డి రైజర్స్‌ నేడు ఎలిమినేటర్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఎలిమినేటర్‌, రాత్రి 7.15 గంటలకు క్వాలిఫయర్‌1 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మ్యాచ్‌లు స్టార్‌స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -