- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) 2026-27 ఆర్థిక సంవత్సరం ఆదాయానికి సంబంధించి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) శుక్రవారం బహిరంగ విచారణ జరపనుంది. ఆదాయ ఆవశ్యకతలు (ఏఆర్ఆర్), రిటైల్ సరఫరా ధరలు, క్రాస్-సబ్సిడీ, సర్చార్జీల ప్రతిపాదనలపై జరగనున్న విచారణలో ఆసక్తి గల ప్రజలు, వినియోగదారులు, ఇతరులు హాజరై తమ అభిప్రాయాలను చెప్పాలని టీజీఈఆర్సీ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లోని కళ్యాణ్నగర్లో గల విద్యుత్ నియంత్రణ మండలి భవన్లో విచారణ నిర్వహించనున్నట్టు తెలిపింది.
- Advertisement -



