నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డి2సి ఓపెన్ ఫుట్వేర్ బ్రాండ్ అయిన చుప్స్ ఫుట్వేర్, భారతదేశంలోని ప్రముఖ హై-పెర్ఫార్మెన్స్ బ్యాడ్మింటన్ ఇనిస్టిట్యూట్ లలో ఒకటైన పి. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పిజిబిఎ)తో అధికారిక పోస్ట్-రికవరీ, అథ్లెజర్ ఫుట్వేర్ భాగస్వామిగా ఒప్పందం చేసుకుంది. ఈ భాగస్వామ్యం ఏడాది పాటు కొనసాగుతుంది. హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో చుప్స్ ఫుట్వేర్ వ్యవస్థాపకుడు యశేష్ ముఖి, పుల్లెల గోపీచంద్ సంయుక్తంగా ఈ భాగస్వామ్యాన్ని అధికారికంగా ధృవీకరించారు.
ఈ భాగస్వామ్యానికి కీలకంగా పుల్లెల గోపీచంద్ ఉన్నారు. సైనా నెహ్వాల్ ఒలింపిక్ విజయం తో పాటుగా ఒలింపిక్ రజత పతక విజేత, పి.వి. సింధు వెనుక ఉన్న దిగ్గజ కోచ్, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్, గోపీచంద్ . భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన కోచ్లలో ఒకరైన ఆయన, చుప్స్ యొక్క రికవరీ ఫుట్వేర్ విభాగానికి మరింత శాస్త్రీయ కచ్చితత్వాన్ని తీసుకురావడానికి ఆ సంస్థతో కలిసి పనిచేయనున్నారు. భారతదేశంలోని అత్యంత కఠినమైన శిక్షణా వాతావరణాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ అకాడమీలో క్రీడాకారులు ఎక్కువ గంటలు శిక్షణ పొందుతుంటారు. వారి దినచర్యలో రికవరీ ఒక కీలకమైన భాగం. ఈ భాగస్వామ్యం ఆటగాళ్లకు కోర్టు వెలుపల సమయంలో చుప్స్ ఫుట్వేర్ ను ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది. దీనివల్ల, రోజువారీ వాడకం ద్వారా సౌకర్యం, కుషనింగ్, ఫిట్ మరియు రికవరీపై క్రీడాకారుల ప్రత్యక్ష అభిప్రాయాన్ని సేకరించడానికి బ్రాండ్కు అవకాశం లభిస్తుంది.
క్రీడాకారులు,కోచ్ల నుండి నిరంతరం అందే ఈ అభిప్రాయాలు, సూచనలు, చుప్స్ ఫుట్వేర్ తమ రికవరీ , అథ్లెజర్ విభాగాన్ని అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఉత్పత్తి రూపకల్పన మరియు అభివృద్ధిని చేపట్టే విధానానికి తోడ్పడుతాయి.
అగ్రశ్రేణి అంతర్జాతీయ ఆటగాళ్లను తయారు చేయడంలో పేరుగాంచిన పి. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ప్రదర్శన, క్రమశిక్షణ మరియు నిలకడపై ప్రధానంగా దృష్టి సారించి పనిచేస్తుంది. ఈ భాగస్వామ్యం, క్రీడాకారుల కోలుకునే ప్రక్రియ మరియు పాదాల ఆరోగ్యం సహా వారి సమగ్ర శ్రేయస్సుకు అకాడమీ ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా ఉంటుంది.
ఉత్పత్తి అనుసంధానానికి అతీతంగా, ఈ భాగస్వామ్యం ఈ క్రింది వాటి ద్వారా అమలు చేయబడుతుంది:
· బలమైన గుర్తింపును పెంపొందించడానికి పీజీబీఏలో ఆన్-గ్రౌండ్ బ్రాండింగ్
· అథ్లెట్ల నుండి వచ్చిన ప్రామాణికమైన కథలతో కూడిన కో-బ్రాండెడ్ డిజిటల్ కంటెంట్
· ఉత్పత్తి అభివృద్ధిని తీర్చిదిద్దడంలో గోపీచంద్ మరియు అథ్లెట్లతో ప్రత్యక్ష అభిప్రాయ సేకరణ
ఈ భాగస్వామ్యం గురించి పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ, “ప్రతి అథ్లెట్ ప్రయాణంలో రికవరీ అనేది ఒక ముఖ్యమైన భాగం. అయినప్పటికీ, దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత సరిగా ఇవ్వరు. శిక్షణా సెషన్ల మధ్య అథ్లెట్లు కోలుకోవడానికి సౌకర్యవంతమైన, సహాయక పాదరక్షలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అథ్లెట్ల అవసరాలను అర్థం చేసుకోవడంలో ఆలోచనాత్మకమైన విధానాన్ని అవలంబిస్తూ, తమ ఉత్పత్తులను మెరుగుపరచడానికి వాస్తవ అభిప్రాయాన్ని ఉపయోగించుకుంటున్న చుప్స్ ఫుట్వేర్ వంటి బ్రాండ్తో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉంది” అని అన్నారు.
ఈ భాగస్వామ్యం గురించి చుప్స్ ఫుట్వేర్ వ్యవస్థాపకుడు యశేష్ ముఖి మాట్లాడుతూ, “ఎక్కువ మంది క్రీడలు , ఫిట్నెస్ పట్ల ఆసక్తిని కనబరుస్తున్నందున రికవరీ అనేది చర్చలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతోంది. మా వరకూ, ఈ భాగస్వామ్యం వాస్తవ వినియోగాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి, ఉత్పత్తిని అర్థవంతమైన రీతిలో మెరుగుపరచడానికి ఒక అవకాశం” అని అన్నారు.
ఆటగాళ్ల అభిప్రాయాలు, వాస్తవ పనితీరు ధృవీకరణ మద్దతు కారణంగా అభివృద్ధి చెందుతున్న రికవరీ, అథ్లెజర్ విభాగంలో విశ్వసనీయతను పెంపొందించుకోవడంలో చుప్స్ ఫుట్వేర్ కు ఈ భాగస్వామ్యం ఒక వ్యూహాత్మక ముందడుగుగా నిలుస్తుంది. ఈ బ్రాండ్ డి2సి, మింత్రా, అమెజాన్ వంటి మార్కెట్ప్లేస్లు, మరియు పెరుగుతున్న ఆఫ్లైన్ ఉనికి ద్వారా తమ ఓమ్నిఛానల్ కార్యకలాపాలను విస్తృతం చేసుకుంటూనే ఉంది.


