రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
నవతెలంగాణ – మిరుదొడ్డి
మహిళల ఆర్థిక అభివృద్ధి చెందడానికి మహిళా సంఘాలు ఎంతగానో దోదపడతాయని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య , గ్రామ సర్పంచ్ చంద్రకళ కనకయ్య లు అన్నారు. అక్బర్ పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామం లో డ్వాక్రా మహిళా భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి మహిళ సంఘంలో ఉండాలని సూచించారు మహిళలు అభివృద్ధి చెందాలంటే మహిళా సంఘాలతోనే మరింత అభివృద్ధి చెందుతారన్నారు బ్యాంకు ద్వారా రుణాలు పొంది కుటుంబం అభివృద్ధి చేసుకునే విధంగా చూడాలని తెలిపారు.
మహిళలు ఆర్థిక అభివృద్ధి గ్రామం అభివృద్ధి చెందుతుందని సూచించారు. గ్రామ అభివృద్ధికి యువకులు సహకారం ఎంతో అవసరమని అన్నారు. అనంతరం రుద్రారం గ్రామంలోని ఎస్టీ వాడను సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్టీ వాడలో నెలకొన్న సమస్యలను పరిష్కారం అయ్యో దిశగా కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రమేష్ గౌడ్,గ్రామ వార్డ్ సభ్యులు,మహిళా సంఘం సభ్యులు,గ్రామ వి ఓ ఏ లు శోభ ,భాగ్య ,అంగన్వాడీ టీచర్లు,ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ,పోతారం మురళి,పడాల రాజు,రాజేశ్వర్ రెడ్డి,నవీన్, అశోక్, అరవింద్, లక్ష్మీనర్సు ,భూంపల్లి గ్రామ మాజీ ఎంపిటిసి ఉల్లెంగళ నవ్య-నరేష్,మాజీ ఉపసర్పంచ్ వడ్ల ప్రభాకర్ ఇతరులు ఉన్నారు.



