- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ సోమవారం నుంచి ఎడ్జ్బాస్టన్లో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు తొలి మ్యాచ్ మొదలవుతుంది. టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా, ఈ వన్డే సిరీస్ను గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సిరీస్కు శుభ్మన్ గిల్ కెప్టెన్గా, శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చారు. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా బాధ్యతలు చేపట్టనున్నారు.
- Advertisement -



