- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా చేపట్టిన ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ జులై 14వ తేదీతో ముగియనుంది. బూత్ లెవెల్ ఆఫీసర్లకు (BLO) లేదా ఆన్లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫామ్ను సమర్పించని వారు తమ ఓటును కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 98.32% మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేసినట్లు ఎన్నికల సంఘం (EC) వెల్లడించింది. రాజకీయ పార్టీలు, కలెక్టర్ల అభ్యర్థన మేరకు ఈ గడువును మరో 10 రోజులు పొడిగించాలని కోరుతూ ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
- Advertisement -



