- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ వైద్య కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. 20 ఏళ్ల కశిష్ను ఆమె సహవిద్యార్థి సాగర్ కత్తితో పొడిచి చంపాడు. కశిష్ను రక్షించడానికి ప్రయత్నించిన నర్సింగ్ సిబ్బంది కూడా గాయపడ్డారు. కాన్పూర్ నివాసి అయిన సాగర్, కశిష్తో ప్రేమలో ఉన్నాడు. ఇటీవల వారిద్దరి మధ్య తలెత్తిన వివాదం ఈ దారుణానికి కారణమైంది. ఇద్దరూ ఎక్స్-రే టెక్నీషియన్ల కోర్సు చేస్తున్నారు.
- Advertisement -



