Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చదివింది ఎంటెక్.. అమ్మేది ఆకు కూరలు

చదివింది ఎంటెక్.. అమ్మేది ఆకు కూరలు

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణానికి చెందిన ఆకుల ఈశ్వర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలి పట్టణం ప్రియదర్శిని డిగ్రీ పీజీ కళాశాలలో ఎంటెక్ చదివారు. తల్లిదండ్రులు స్థానికంగా ఉపాధి కరువై జీవనోపాధి కోసం హైదరాబాద్ వలస వెళ్లారు. ఈశ్వర్ తన మామ మోహన్ దగ్గర అచ్చంపేటలో నివాసం ఉంటున్నాడు. పట్టణ శివారులోని తనకున్న మూడు ఎకరాల భూమిలో సాగు చేస్తున్న పుంటి కూర, పాలకూర, తోటకూర, కొత్తిమీర, గోంగూర, మెంతం కూర ఆకుకూరలు, టమాటా, కాకరకాయ, బెండకాయ,దోసకాయ, కూరగాయలు సాగు చేస్తున్నాడు.

కూరగాయల మార్కెట్ అమ్ముకునే వారికి సగం వరకు సప్లై చేస్తున్నాడు. తాను ఉపాధి పొందుతూ మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు ఆకుకూరలు సాగు చేస్తున్న రైతు మోహన్ తెలిపారు. ఈశ్వరు మామ సాగుచేసిన ఆకుకూరలు హోల్ సేల్ పై అమ్ముకునే వారికి  సప్లై చేస్తున్నాడు. తాను అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు పక్కన  ఆకుకూరలు, కూరగాయలు  విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -