Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాలి

ఎమ్మెల్యే హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాలి

- Advertisement -
  • సర్పంచ్ మల్లెపాక సాయి బాబా
    నవతెలంగాణ – తుంగతుర్తి
    గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో హిందూ ధర్మానికి అవమానం కలిగే విధంగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ధర్మాన్ని కాపాడే బ్రాహ్మణులను అసభ్య పదజాలంతో మాట్లాడడం ఎంతవరకు సమంజసమని తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబా అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ది హిందూ మతం కానందున ధర్మాన్ని అగౌరవపరిచే మాటలు మాట్లాడటం మంచిది కాదన్నారు. ఎవరికి నచ్చిన మతం వాళ్లు ఆచరించవచ్చు అని కానీ, ఇతరుల మతాన్ని కించపరచడం తగదు అన్నారు. వేదికల మీద సబ్జెక్టు లేకుండా ఏది పడితే అది మాట్లాడితే నవ్వులపాలు కావాల్సి వస్తుందని అన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -