- Advertisement -
నవతెలంగాణ – సిద్దిపేట
ఖైదీ పరారైన సంఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలను శనివారం సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో పోలీస్ వాన్ ఎమర్జెన్సీ డోర్ నుంచి పోలీసుల కండ్లు కప్పి సాయి కుమార్ అనే ఖైదీ పరారైనట్లు తెలిసింది. ఖైదీ సాయికమార్ బైకు దొంగతనం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. పరారైన ఖైదీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
- Advertisement -



