- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్లో భారీ పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో మదుపరులు అమ్మకాలకు తెగబడటంతో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1460 పాయింట్లు కుప్పకూలి 75,243 వద్ద ట్రేడ్ అవుతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 450 పాయింట్లు నష్టపోయి 23,349 స్థాయికి దిగజారింది. ఈ పతనంతో మదుపర్ల సంపద ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల మేర ఆవిరైంది.
దీనికి తోడు ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ మేఘాలతో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 111 డాలర్ల మార్కును దాటడం భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.
- Advertisement -



