Wednesday, July 29, 2026
E-PAPER
Homeబీజినెస్ఒడిషా AM/NS ఇండియా ఖో ఖో హై పెర్ఫార్మెన్స్ సెంటర్

ఒడిషా AM/NS ఇండియా ఖో ఖో హై పెర్ఫార్మెన్స్ సెంటర్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ద ఒడిషా AM/NS ఇండియా ఖో ఖో హై పెర్ఫార్మెన్స్ సెంటర్ (ఒడిషా AM/NS KHPC), పూరీ ఎంతో వైభవోపేతమైన వేడుకతో తమ రెండవ వార్షికోత్సవాన్ని సంబరం చేసింది. దీనిలో భాగంగా జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై తమ సామర్థ్యం ప్రదర్శించిన సెంటర్ యొక్క అథ్లెట్స్ కు సత్కారం మరియు ఖో ఖో ఎంపిక ట్రయల్స్ 2026 ద్వారా ఆశాజనక అథ్లెట్స్ యొక్క కొత్త బ్యాచ్ ను  చేర్చుకోవడం వంటివి ఉన్నాయి.  భారతదేశపు భవిష్య ఖో ఖో ఛాంపియన్స్ ను పోషించడంలో సెంటర్ యొక్క ప్రయాణంలో ఇది గణనీయమైన మైలురాయిగా నిలుస్తుంది.

దేశంలో ఖో ఖో ప్రతిభను పోషించడానికి అర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (AM/NS India)  మరియు ఒడిషా ప్రభుత్వం మధ్య   ఒడిషా AM/NS ఇండియా ఖో ఖో హై పెర్ఫార్మెన్స్ సెంటర్ ఒక సహకార కార్యక్రమం.  ఇది ఈ క్రీడ కోసం అవసరమైన జడ్జీలకు కూడా శిక్షణనిచ్చి మరియు అభివృద్ధి చేస్తుంది. ఒడిషా AM/NS కేహెచ్ పిసి యొక్క అథ్లెట్లు ఖో ఖో ప్రపంచ కప్పు 2025, జాతీయ క్రీడలు 2025, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025, జూనియర్ నేషనల్ ఖో ఖో ఛాంపియన్ షిప్ 2024-2026, సీనియర్ నేషనల్ ఖో ఖో ఛాంపియన్ షిప్ 2025- 2026, సబ్-జూనియర్ నేషనల్ ఖో ఖో ఛాంపియన్ షిప్ 2025-2026 వంటి వివిధ ప్రతిష్టాకరమైన అంతర్జాతీయ మరియు జాతీయ వేదికల్లో కూడా ప్రశంశలు సాధిస్తున్నారు.  సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించిన రెండేళ్ల సమయంలో, అథ్లెట్లు 30 కంటే ఎక్కువ జాతీయ, ప్రాంతీయ మరియు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు మరియు వివిధ శ్రేణుల్లో 48 పతకాలు సాధించారు. ఇది స్థిరంగా ప్రతిభావంతులను తీర్చిదిద్దే ఒడిషా AM/NS కేహెచ్ పిసి యొక్క  బాధ్యతను దృఢతరం చేస్తుంది. ఇక్కడ క్రమబద్ధమైన శిక్షణ మరియు ఉన్నత స్థాయి పోటీలలో పాల్గొనే  అవకాశాలు గణనీయమైన విజయం మరియు జాతీయ స్థాయిలో గుర్తింపుగా మారుతున్నాయి.

శ్రీ. అషుతోష్ టెలాంగ్, డైరెక్టర్ & వైస్ ప్రెసిడెంట్- HR & అడ్మినిస్ట్రేషన్, AM/NS ఇండియా ఇలా అన్నారు, రెండు సంవత్సరాల అతి తక్కువ సమయంలో కూడా, ఒడిషా AM/NS ఇండియా ఖో ఖో హై పెర్ఫార్మెన్స్ సెంటర్ ఖో ఖో రంగంలో క్రమబద్ధమైన శిక్షణ మరియు ప్రతిభను అభివృద్ధి చేసే దిక్సూచిగా తనను తాను స్థిరపరుచుకుంది. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో మా అథ్లెట్లు యొక్క విజయాలు వారి అంకితభావాన్ని మాత్రమే కాకుండా మేము కలిసి రూపొందించిన వ్యవస్థ యొక్క శక్తిని కూడా సూచిస్తున్నాయి. మేము కొత్త అథ్లెట్ల బ్యాచ్ ని ఆహ్వానిస్తున్నప్పుడు, క్రమశిక్షణ మరియు శ్రేష్టత మరియు పోటీయుత స్ఫూర్తికి మా నిబద్ధతను మేము పునరుద్ఘాటిస్తూనే, అంతర్జాతీయంగా ఖో ఖో క్రీడలో భారతదేశాన్ని ఉన్నత స్థాయికి నిలబెట్టే ఛాంపియన్స్ ను కూడా తీర్చిదిద్దుతున్నాము.

ఈ కార్యక్రమానికి శ్రీ ప్రతీక్ వైకర్, ఇండియన్ మెన్స్ ఖో ఖో టీమ్ యొక్క కెప్టెన్ ప్రత్యేక అతిథిగా విశిష్ట అధికారిగా  హాజరయ్యారు. గౌరవ అతిధులుగా శ్రీ ప్రద్యుమ్న మిశ్రా, వైస్ ప్రెసిడెంట్, ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా  & సెక్రటరీ, ఒడిషా ఖో ఖో అసోసియేషన్, డాక్టర్. దేబబ్రత డాష్, ప్రధాన అధికారి- HR (ఈస్ట్), AM/NS ఇండియా, డాక్టర్ వికాస్ యదవేందు, ప్రధాన అధికారి- CSR, AM/NS ఇండియా, మరియు శ్రీ సాగర్ సమల్, ప్రాజెక్ట్ ప్రధాన అధికారి, స్పోర్ట్స్ ఫర్ ఆల్ (SFA), ఒడిషా AM/NS KHPC కోసం అమలు చేసే భాగస్వామి హాజరయ్యారు. వారి హాజరు అథ్లెట్లకు ప్రోత్సాహం కలిగించింది, సెంటర్ యొక్క ప్రయాణంలో కొత్త అధ్యాయంకి ప్రాతినిధ్యంవహించే అథ్లెట్లు యొక్క చేరిక కోసం వేదికను సిద్ధం చేసింది.

ఖో ఖో ఎంపిక ట్రయల్స్ 2026 తరువాత జరిగిన చేరికల వేడుక కార్యక్రమంలో జూనియనర్ మరియు సీనియర్ విభాగాలకు చెందిన 31 మంది క్రీడాకారులు తమ స్థానాలను నిలబెట్టుకోగా, 10 మంది బాలురు మరియు 9 మంది బాలికలతో కూడిన 19 మంది కొత్త క్రీడాకారులకు ఆ కేంద్రంలో స్వాగతించారు. పూర్తి 2024 బ్యాచ్ జూనియర్ స్థాయికి చేరుకోవడంతో కొత్త సబ్-జూనియర్ లను చేర్చుకోవడం  ప్రధానమైంది. అదే విధంగా, ఇప్పటికే ఉన్న జూనియర్లు సీనియర్ శ్రేణికి చేరడంతో 8 కొత్త జూనియర్ అథ్లెట్లు చేరారు. ఈ  మార్పులు క్రమబద్ధమైన ప్రతిభకు వేదికగా సెంటర్ కు  వృద్ధి చెందుతున్న శక్తిని సూచిస్తున్నాయి. ఇవి కొనసాగింపుకు హామీ ఇవ్వడంతో పాటు వర్థమాన క్రీడాకారులు ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందడానికి అవకాశాలను కల్పిస్తాయి.

సత్కారం వేడుకలో, వివిధ జాతీయ స్థాయి ఛాంపియన్ షిప్స్ లో ప్రశంశలు సంపాదించిన అథ్లెట్లకు వారు సాధించిన సాటిలేని విజయాలకు గాను గౌరవించబడ్డారు. సెంటర్ పోటీలకు మించిన శ్రేష్టతను కూడా గుర్తించింది, ఆల్-రౌండ్ పెర్ఫార్మెన్స్, గొప్ప క్రమశిక్షణ, స్థిరమైన విద్యా శ్రేష్టత మరియు క్రీడా మైదానంలో గొప్ప తోడ్పాటును అందచేసిన అథ్లెట్లను కూడా గుర్తించింది. ఎగ్జిబిషన్ మ్యాచ్ లో అథ్లెట్లు కూడా తమ నైపుణ్యాలను ప్రదర్శించారు,  ఆధునిక ఖో ఖోను నిర్వచించే వేగం, లాఘవం, వ్యూహాత్మక ప్రతిభ మరియు పోటీయుత స్ఫూర్తిని చూపించారు.

ఒడిషా AM/NS ఇండియా ఖో ఖో హై పెర్ఫార్మెన్స్ సెంటర్ తమ మూడవ సంవత్సరంలోకి ప్రవేశించిన కారణంగా, ప్రపంచ స్థాయికి చెందిన అథ్లెట్లను అభివృద్ధి చేసి మరియు ఖో ఖోలో అంతర్జాతీయ శక్తి కేంద్రంగా  భారతదేశపు స్థానాన్ని శక్తివంతం చేసే తన కలకు కట్టుబడి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -