- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. కంపెనీలు, సంస్థలు, సాధ్యమైనచోట వర్క్ఫ్రంహోం అమలుచేయాలని కోరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉద్యోగులకు విడతలవారీగా ముందస్తు లాగౌట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. లాగౌట్ సమయాన్ని పోలీసులకు ఈమెయిల్ ద్వారా తెలపాలని సూచించారు. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ, అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా ఉంటుందన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
- Advertisement -



