- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2 గంటల్లో పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, పెద్దపల్లి, కరీంనగర్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
- Advertisement -



