- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : 2034 వరకు తెలంగాణ సీఎంగా తానే ఉంటానని రేవంత్రెడ్డి అన్నారు. ఫిన్లాండ్, జర్మనీ టీచర్ ఎక్స్చేంజ్ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ‘‘నేను విద్యాశాఖకు ఎందుకు రాజీనామా చేయాలి? పిల్లలకు అల్పాహారం అందించినందుకు రాజీనామా చేయాలా? ఐటీఐలను కాకుండా ఏటీసీలను ఏర్పాటు చేసినందుకా? మండలాల్లో విద్యాభివృద్ధికి ఏం కావాలో ఉపాధ్యాయులు సలహాలు ఇవ్వండి. టీచర్ల సలహాలను అధికారులు అమలు చేస్తారు. విద్యారంగంపై ఖర్చు పెట్టడానికి నాకు ఇబ్బంది లేదు.’’ అని అన్నారు.
- Advertisement -



