Tuesday, August 4, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మృతి

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మృతి

- Advertisement -

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..
నవతెలంగాణ – హైదరాబాద్ :సై’ సినిమాలో భిక్షు యాదవ్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మృతి చెందారు. 74 ఏళ్ల ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ప్రదీప్ రావత్ తెలుగు, హిందీ, తమిళ సినిమాలతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. తెలుగులో 2004లో వచ్చిన సై సినిమాలో చూపించిన విలనిజంతో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత 2005లో వచ్చిన గజినీ సినిమాతో విలన్ గా మరింత స్టార్డమ్ సంపాదించారు.  సై, గజినీ, ఛత్రపతి మొదలైన బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ నటుడు , గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం (ఆగస్టు 04) ముంబయిలో  గుండెపోటుతో మృతి చెందారు. గత కొంత కాలంగా   బ్లడ్ క్యాన్సర్ తో  బాధపడుతున్నారు.  ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు నటి విపన థప తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -