- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : థాయ్లాండ్లోని నరాతివాత్ ప్రావిన్స్లో గోలక్ కప్లో భాగంగా శాంటిప్హాప్ స్టేడియంలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో విషాదం చోటుచేసుకుంది. ఆటగాడు సోఫన్ అవేయ్(24)పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మెరుపు తాకినప్పుడు ఆటగాడికి మంటలు అంటుకుని కుప్పకూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
- Advertisement -


