- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
దర్పల్లి గ్రామ రోజువారీ, వారాంతపు తైబజార్ కొరకు శనివారం పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ సమక్షంలో వేలంపాట నిర్వహించారు. దీంతో వారాంతపు సంతకు రూ.4 లక్షల 10వేలకు అబ్దుల్ యాకూబ్ దక్కించుకున్నారు. రోజువారీ తైబజార్ కు కనిసపు మద్దతు ధర రాకపోవడంతో రోజువారీ తైబజార్ వెలన్నీ సోమవారానికి వాయిదా వేశారు. ఈ కార్యక్రమములో ఉప సర్పంచ్ శ్రీకాంత్, కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



