నవతెలంగాణ-హైదరాబాద్ : చైన్నై సూపర్ కింగ్స్ 127 పరుగులకే కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆరంభం నుంచి వరుస వికెట్లు కోల్పోయింది. విజృంభిస్తాడనుకున్న సంజుశాంసన్ 7 బంతులు ఆడి 6పరుగులు మత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తరువాత కెఫ్టెన్ రుతురాజ్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. ఇక వచ్చిన బ్యాటర్లు వెంట వెంటనే పెవిలియన్కు క్యూ కట్టారు. జెమ్మి ఓవర్టన్ ఒక్కడే 43 అత్యదిక స్కోరు చేయడంతో చెన్నై జట్టు 127 పరుగులు చేయగలిగింది. దీంతో రాయల్స్ కు 128 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, జడేజా రెండెసి వికెట్లు తీయగా బ్రిజెస్ శర్మ, సందీప్ శర్మ, బిష్ణోయ్ తలో వికెట్ తీసుకున్నారు.



