- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్గఢ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముంబైకి చెందిన 24 ఏళ్ల ప్రముఖ మోటో వ్లాగర్, బైకర్ రిద్దీ తక్కర్ మరణించారు. అమ్మాయిల బృందంతో కలిసి ముంబై నుంచి బస్తర్ పర్యటనకు వెళ్తున్న సమయంలో, వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ ఆమె బైక్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రిద్దీని తోటి రైడర్లు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి ట్రక్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
- Advertisement -



