- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు, కార్యదర్శి గంగాధర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తి నినాదాలు చేస్తూ వేడుకలను నిర్వహించారు.
- Advertisement -



