- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సోలార్ ప్యానెల్, ఈవీల తయారీలో రాష్ట్రం ముందంజలో ఉందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం హైటెక్స్లో జరిగిన ఎనర్జీ సమ్మిట్లో పాల్గొన్న భట్టి మాట్లాడుతూ.. విద్యుత్తు సరఫరాలోనూ ఏఐ పరిజ్ఞానాన్ని వాడుకొని, వృథాను అరికట్టాలన్నారు. ఇంధన రంగాన్ని మరింత విస్తరించాల్సి ఉందని, పెరుగుతున్న రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు ఉత్పత్తిని పెంచుతున్నామన్నారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు.
- Advertisement -



