- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఉరేసుకుని ట్రైనీ డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్లో చోటు చేసుకుంది. సీతాకోకచిలుకల సెంటర్కు చెందిన డోలి సంధ్య గ్రూప్-2 ద్వారా డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తోంది. ఇటీవల తన ఇంటికి వచ్చిన సంధ్య ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
- Advertisement -


