- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హాకీ వరల్డ్ కప్లో నేడు చిరకాల ప్రత్యర్థుల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్వీన్ వేదికగా పూల్-డిలో జరిగే ఈ కీలక మ్యాచ్లో పాక్, భారత్ జట్లు తలపడనున్నాయి. నెక్ట్స్ రౌండ్కు వెళ్లాలంటే ఇరు జట్లకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఒకవేళ డ్రా అయినా టీంఇండియా క్వాలిఫై అవుతుంది. అయితే పాక్ మాత్రం తప్పక గెలిస్తేనే తదుపరి రౌండ్కు వెళ్తుంది. దీంతో ఈ మ్యాచ్పై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 6.30 గంటలకు స్టార్ట్ కానున్న ఈ పోరును స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్లో లైవ్ చూడొచ్చు.
- Advertisement -



