- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని దుబ్బాక, దమ్మన్నపేట, గ్రామాల్లో శనివారం అయ గ్రామాల పంచాయతీ కార్యాలయాల ఆధ్వర్యంలో సర్పంచులు, సరోజినీ దేవి, తలారి వసంతలు చలివెంద్రాన్ని ప్రారంభించారు. వేసవి దృష్టిలో ఉంచుకొని గ్రామస్థులకు మట్టి గుండాల్లో చల్లని నీటిని ప్రజలకు అందించాలని ఈ చలివెంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నీటిని ప్రతిరోజు శుద్ధిగా అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమములో ఎంపిఓ రాజేష్, ఆయా గ్రామాల గ్రామకార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



