- Advertisement -
నవతెలంగాణ విశాఖపట్నం: విశాఖలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో షాకింగ్ ఘటన జరిగింది. హోమ్వర్క్ చేయలేదని టీచర్ మందలించగా ఎల్కెజీ విద్యార్థి ప్రణయ్ తేజ్(6) భయాందోళనకు గురయ్యాడు. గుక్కపెట్టి ఏడుస్తూ టీచర్పైనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని కేజీహెచ్కు తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటికి రావడంతో బాలుడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహంతో పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు.
- Advertisement -



