- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామపరిదిలోగల కెజిబివి పాఠశాలలో శనివారం వృక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించీనట్లుగా పాఠశాల స్పెషల్ ఆపిసర్ ఎం.భవాని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు చెట్టుని ఆలింగనం చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణాన్ని పరిరక్షిస్తామని తెలియజేశారు. తల్లి వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాళ్లు,విద్యార్థినీలు పాల్గొన్నారు.
- Advertisement -



