- Advertisement -
నవతెలంగాణ-నవాబుపేట
మండల కేంద్రములోని జేకే ట్రస్ట్ డైరెక్టర్లు ప్రతి ఆదివారం వచ్చే ప్రజలకు ఉచితంగా అందిస్తున్న బోజన కార్యక్రమం నేటి వారంతో వందరోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మండల కేంద్రము లో ప్రజలకు ఉచితంగా అందిస్తున్న బోజన కార్యక్రమాలతో పాటు వివిధ రకాల సేవలను అందిస్తున్నందుకు పలువురు ప్రముఖులు మేధావులు రాజకీయ నాయకులు జేకే ట్రస్ట్ డైరెక్టర్లను అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్లు నర్సింహ చారి సుధాకర్ చారి మాట్లాడుతూ తమ ట్రస్ట్ అందిస్తున్న సేవలు మున్ముందు మరెన్నో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
- Advertisement -



